India Corona: కొత్త కేసులు.. 6 వేలకు దిగొచ్చాయి..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల 10 వేల దిగువకు చేరిన కొత్త కేసులు.. తాజాగా 6 వేలకు దిగొచ్చాయి. మృతుల సంఖ్య అదుపులోనే ఉంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సానుకూల గణాంకాలను వెల్లడించింది. 

Published : 01 Mar 2022 09:56 IST

లక్ష దిగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల 10 వేల దిగువకు చేరిన కొత్త కేసులు.. తాజాగా 6 వేలకు దిగొచ్చాయి. మృతుల సంఖ్య అదుపులోనే ఉంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సానుకూల గణాంకాలను వెల్లడించింది. 

సోమవారం 9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..6,915 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొత్త కేసులు డిసెంబర్ చివరినాటి స్థాయికి చేరాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. ఇక ఇప్పటివరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది.

24 గంటల వ్యవధిలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు ఆ సంఖ్య 120 దిగువన ఉంది. ఇప్పటివరకు 5,14,023 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య లక్ష లోపునకు చేరింది.  దాంతో క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి తగ్గిపోయింది.

నిన్న 16,864 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. రికవరీ రేటు 98.59 శాతానికి పెరిగింది. 

మరోపక్క 18 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 177 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని