India corona: ఊరటనిస్తోన్న గణాంకాలు.. 20 వేల దిగువకు క్రియాశీల కేసులు..!

గత కొద్దిరోజులుగా దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. మహమ్మారి ఉద్ధృతి ప్రారంభ రోజుల నాటి స్థాయికి తగ్గుతూ ఊరటనిస్తోంది.

Published : 26 Mar 2022 10:04 IST

4 వేల మరణాలు ఎందుకొచ్చాయంటే..?

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది.మహమ్మారి ఉద్ధృతి ప్రారంభ రోజుల నాటి స్థాయికి తగ్గుతూ ఊరటనిస్తోంది. దాంతో మరోరోజు కొత్త కేసులు 2 వేలకు దిగువనే నమోదయ్యాయి. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. 

శుక్రవారం 6.5 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా..1,660 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. కొద్దికాలంగా రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువనే నమోదవుతోంది. 

ఇక గత కొన్ని రోజులుగా 100 దిగువనే నమోదవుతున్న మరణాలు.. నిన్న 4,100కి పెరిగాయి. మహారాష్ట్ర(4,007), కేరళ(81) మునుపటి గణాంకాలను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. దీంతో  ఇప్పటివరకూ 5.20 లక్షల మంది కరోనాకు బలయ్యారు.

• ఇక నిన్న 2,349 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 20 వేల దిగువకు చేరి, 16,741కి తగ్గిపోయాయి. క్రియాశీల రేటు 0.04 శాతానికి పడిపోగా.. రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది.

• ప్రస్తుతం దేశంలో కరోనా టీకా కార్యక్రమం దశలవారీగా ముందుకు సాగుతోంది. నిన్న 29.07 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 182 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని