India Corona: 15 వేలు దాటిన క్రియాశీల కేసులు..!

గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్ప స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దిల్లీలో వెయ్యికి సమీపంలో కేసులొస్తున్నాయి.

Updated : 23 Apr 2022 10:00 IST

దిల్లీ: గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్ప స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దిల్లీలో వెయ్యికి సమీపంలో కేసులొస్తున్నాయి. తాజా వ్యాప్తితో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* శుక్రవారం 4.5 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,527 మందికి పాజిటివ్‌గా తేలింది. దిల్లీలో 1,042 మందికి కరోనా సోకింది. దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి చేరింది.

నిన్న 33 కొవిడ్ మరణాలు సంభవించాయి. కేరళలో నమోదైన మృతుల సంఖ్య 31 కాగా, దిల్లీలో ఇద్దరు మరణించారు. ఇప్పటివరకూ 5.22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ రోజుకూడా కొత్త కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. నిన్న 1,656 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 15,079కి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని