India Corona: దేశంలో కొత్తగా 3,688 కేసులు.. దిల్లీలోనే 16 వందలకుపైగా..

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూవస్తున్నాయి. మూడు రోజులుగా మూడు వేలకుపైనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

Published : 30 Apr 2022 10:15 IST

18 వేలు దాటిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా మూడు వేలకుపైనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దాంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం..

శుక్రవారం 4.96 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,688 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ముందురోజు కంటే 300 అధికంగా కొత్త కేసులొచ్చాయి. దిల్లీలో తాజాగా 16 వందలు కేసులు రాగా.. పాజిటివిటీ రేటు 5.28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అక్కడ క్రియాశీల కేసులు 5,609కి చేరాయి. దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 18,684(0.04 శాతం)గా ఉంది. 

24 గంటల వ్యవధిలో 2,755 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. నిన్న 50 మంది మరణించారు. వీటిలో కేరళ నుంచే 45 మరణాలు ఉన్నాయి. ఇక నిన్న 22.5 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 188 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని