India Corona: మహారాష్ట్రలో ప్రమాదఘంటికలు.. 200 కొత్త కేసులు..!

స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దిల్లీలో వెయ్యికి పైగానే కొత్త కేసులు నమోదవుతుండగా.. తాజాగా మహారాష్ట్రలో 200కు పైగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 06 May 2022 10:13 IST

కొవిడ్ గణాంకాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దిల్లీలో వెయ్యికి పైగానే కొత్త కేసులు నమోదవుతుండగా.. తాజాగా మహారాష్ట్రలో 200కు పైగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,545 కొత్త కేసులు వచ్చాయి. దిల్లీలో 1,365 మందికి కరోనా సోకగా.. కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత మహారాష్ట్రలో 200కు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం. ఇప్పటి వరకూ 4.30 కోట్లకుపైగా మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. 

24 గంటల వ్యవధిలో 3,549 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 19,688గా ఉన్నాయి. 27 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.74 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. ఈ రెండేళ్ల కాలంలో 5.24 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నిన్న 16.5 లక్షలమంది టీకా తీసుకోగా.. 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని