India Corona: అదుపులోనే కరోనా.. దిగొస్తోన్న క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు మూడు వేలకు దిగువనే నమోదవుతున్నాయి.

Published : 13 May 2022 09:53 IST

మరోరోజు రికవరీలే ఎక్కువ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు మూడు వేలకు దిగువనే నమోదవుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. దాంతో క్రియాశీల కేసులు కూడా దిగొస్తున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

గురువారం 4.86 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,841 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  24 గంటల వ్యవధిలో 3,295 మంది కోలుకున్నారు. మరోరోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదుకావడం సానుకూలాంశం. మహమ్మారి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 18 వేలకు దిగొచ్చాయి. సుమారు రెండేళ్ల కాలంలో 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.25 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 5.24 లక్షలుగా ఉన్నాయి. మరోపక్క నిన్న 14.03 లక్షల మంది టీకా తీసుకోగా.. 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని