India Corona: 16 వేలకు చేరువగా క్రియాశీల కేసులు..!

గత కొద్దికాలంగా దేశంలో కరోనావైరస్ ఒకే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. వెయ్యి నుంచి మూడు వేల మధ్యలో కొత్త కేసులు వస్తున్నాయి.

Updated : 27 May 2022 10:07 IST

కొత్తగా ఎంతమందికి కరోనా సోకిందంటే..?

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి. గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,710 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. 2,296 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొద్దిరోజులుగా పెరుగుతోన్న కొత్త కేసుల ప్రభావం బాధితుల సంఖ్యపై పడుతోంది. దాంతో క్రియాశీల కేసులు 15,814(0.04శాతం)కి చేరాయి. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా.. 4.26 కోట్ల మంది వైరస్‌ను జయించడంతో రికవరీ రేటు 98.75 శాతంగా కొనసాగుతోంది. నిన్న 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 192 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 14.41 లక్షల మంది టీకా వేయించుకున్నారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని