India Corona: 16 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Published : 28 May 2022 10:04 IST

193 కోట్ల టీకా డోసుల పంపిణీ 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

శుక్రవారం 4.47 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,685 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది.

⇒ 24 గంటల వ్యవధిలో 2,158 మంది కోలుకున్నారు. 33 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.31 కోట్లకు పైగా కేసులు రాగా.. అందులో 98.75 శాతం మంది వైరస్‌ను జయించారు. 5.24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 16,308కి చేరింది. దాంతో క్రియాశీల కేసుల రేటు 0.04 శాతంగా నమోదైంది.

⇒ మహమ్మారి కట్టడికి గత ఏడాది కేంద్రం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 12 ఏళ్లు, ఆపై వయస్సువారు దాని కింద టీకా తీసుకుంటున్నారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రికాషనరీ డోసులు కూడా వేస్తోంది. దాంతో ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 193 కోట్ల మార్కును దాటింది. అందులో నిన్న 14.39 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు