India Corona: 18 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో నమోదవుతున్నాయి. ఆ ప్రభావం క్రియాశీల కేసులపై కనిపిస్తోంది.

Updated : 01 Jun 2022 10:14 IST

కొత్తగా నమోదైన కేసులెన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే.. క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. క్రియాశీల కేసులు 18 వేల మార్కు దాటాయి. 

మంగళవారం 4.55 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,745 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పాజివిటీ రేటు 0.60 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,236 మంది కోలుకున్నారు. ఆరుగురు మరణించారు. క్రియాశీల కేసులు 18,386(0.04 శాతం)కి పెరిగాయి. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.26 కోట్ల(98.74 శాతం) మందికి పైగా వైరస్‌ను జయించారు. ఇప్పటివరకూ 5.24 లక్షల మందికిపైగా మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 10.9 లక్షల మందికి పైగా టీకాలు తీసుకోగా.. ఇప్పటివరకూ 193.57 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని