India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మాత్రం కొత్త కేసులు 10వేల దిగువన నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో వైరస్‌ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 79 వేలపైకి ఎగబాకాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

Published : 21 Jun 2022 10:21 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకుపైగానే నమోదైన కొత్త కేసులు.. 10వేల దిగువకు చేరాయి.. పలు రాష్ట్రాల్లో వైరస్‌ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 79 వేలపైకి ఎగబాకాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

* సోమవారం 3.88 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,923 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.55 శాతానికి చేరింది. మహారాష్ట్ర, కేరళలో రెండు వేలకు పైగా కేసులు నమోదుకాగా, దిల్లీలో వెయ్యిమందికి పైగా కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకూ దేశంలో 4.33 కోట్లకు పైగా కేసులొచ్చాయి. 

ఇటీవల కాలంలో కరోనా ఇన్ఫెక్షన్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 79,313కి చేరింది. క్రియాశీల రేటు 0.18 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.61 శాతానికి పడిపోయింది. నిన్న 7,293 మంది కోలుకోగా.. 17 మంది మరణించారు. మొత్తంగా 4.27 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించగా, 5.24 లక్షల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు. 

ఇక నిన్న 13 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని