India Corona: 13,615 కొత్త కేసులు.. 13,265 రికవరీలు..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Published : 12 Jul 2022 10:01 IST

199 కోట్ల టీకా డోసుల పంపిణీ 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 4.21 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,615 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే మూడు వేల మేర కేసులు తగ్గాయి. పాజిటివిటీ రేటు 3.23 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 13,265 మంది కోలుకున్నారు. 20 మంది మరణించారు. క్రియాశీల కేసులు 1,31,043కి ఎగబాకాయి. క్రియాశీల రేటు 0.30 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 4.36 కోట్ల మంది మహమ్మారి బారినపడ్డారు. అందులో 4.29 కోట్ల మంది కోలుకున్నారు. ఈ వైరస్ కట్టడికి గత ఏడాది ప్రారంభం నుంచి కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం కింద 199 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 10.6 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని