India Corona: 7 శాతానికి పాజిటివిటీ రేటు..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 2.39 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకోగా.. 16,866 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Published : 25 Jul 2022 10:04 IST

కరోనా కొత్త కేసులు ఎన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 2.39 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకోగా.. 16,866 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే నాలుగువేల మేర కేసులు తగ్గాయి. పాజిటివిటీ రేటు మాత్రం 7.03 శాతానికి పెరిగింది. పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసులు తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు 7 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,50,877 దాటాయి. క్రియాశీల కేసుల రేటు 0.34 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.46 శాతానికి పడిపోయింది. నిన్న 18,148 కోలుకున్నారు. ఇప్పటి వరకూ 4.39 కోట్ల మంది కరోనా సోకగా.. 4.32 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 24 గంటల వ్యవధిలో 41 మంది మరణించారు. ఇక నిన్నటివరకూ 202 కోట్ల టీకా డోసుల పంపిణీ అయ్యాయి. నిన్న 16.8 లక్షల మంది టీకా తీసుకున్నారని సోమవారం కేంద్రం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని