India Corona: కొనసాగుతోన్న హెచ్చుతగ్గులు.. కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 2.63 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,167 మందికి కరోనా సోకింది.

Published : 08 Aug 2022 10:19 IST

కరోనా గణాంకాలు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 2.63 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,167 మందికి కరోనా సోకింది. పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది. దిల్లీలో మరోసారి 2 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా  24 గంటల వ్యవధిలో 15,549 మంది కోలుకున్నారు. 41 మంది మరణించారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.35 లక్షలకు చేరగా.. ఆ కేసుల రేటు 0.31 శాతంగా నమోదైంది. ఇప్పటివరకూ 4.41 కోట్ల మంది మహమ్మారి బారినపడగా.. 98.50 శాతం మంది వైరస్‌ను జయించారు. ఈ రెండేళ్ల కాలంలో 206 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 34.75 లక్షల మంది టీకా తీసుకున్నారని సోమవారం కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని