Corona: 96శాతానికి పైగా రికవరీ రేటు

దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోంది. శుక్రవారం 19,02,009 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 60,753 మందికి పాజిటివ్‌గా తేలింది.

Updated : 19 Jun 2021 12:21 IST

కొత్తగా 60వేల కేసులు..1,647 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోంది. శుక్రవారం 19,02,009 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 60,753 మందికి పాజిటివ్‌గా తేలింది. గత ఐదు రోజులుగా రోజువారీ కేసులు 60వేల మార్కు వద్దే నమోదవుతున్నాయి. తాజాగా 1,647 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రితంరోజుతో పోల్చితే మృతుల సంఖ్యలో కొద్దిగా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 2.98కోట్లకు చేరగా..3,85,137 మంది ప్రాణాలు కోల్పోయారు.

క్రియాశీల కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 7,60,019 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 2.55 శాతానికి తగ్గింది. నిన్న 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2.86కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 33,00,085 మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 27కోట్ల మార్కును దాటినట్లు  కేంద్రం వెల్లడించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని