G20: కశ్మీర్లో జీ20.. నోరుపారేసుకున్న చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
భారత్పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేసింది. G20 సదస్సు(G20 meeting in Kashmir) నిర్వహించే ప్రాంతంపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరానికి భారత్ ఘాటుగా బదులిచ్చింది.
దిల్లీ: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) విషయంలో చైనా(China) మరోసారి నోరు పారేసుకుంది. పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్(G20 meeting in Kashmir)లో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని శ్రీనగర్లో మే 22, 23, 24 తేదీల్లో జరగనున్న జీ 20(G20) సదస్సు కోసం భద్రతాదళాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. స్థానిక షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటరులో ఈ సదస్సు జరగనున్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. జీ20 సదస్సుకు తాము హాజరుకావడం లేదని వెల్లడించింది. వివాదాస్పద భూభాగంలో ఇటువంటి భేటీలను జరపడాన్ని తాము వ్యతిరేకిస్తామని డ్రాగన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యలు చేశారు. ‘తన సొంత భూభాగంలో ఎక్కడైనా భారత్ స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుంది. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరత అవసరం’అని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సదస్సుకు తుర్కియే, సౌదీ అరేబియా కూడా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.
2019లో జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జరుగుతున్న కీలక అంతర్జాతీయ సమావేశమిది. 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని కేంద్ర టూరిజం కార్యదర్శి అరవింద్ సింగ్ దిల్లీలో మీడియాకు తెలిపారు. దాంతో భద్రతాపరంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) దళాలు, మెరైన్ కమాండోల బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇతర పారామిలటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు.
స్థానిక దాల్ సరస్సు పరిసర ప్రాంతాలను మెరైన్ కమాండోలు జల్లెడ పట్టారు. శికారాల్లో (పడవల్లో) తిరుగుతూ చుట్టూ నిఘా పెంచారు. ఎన్ఎస్జీ దళాలు స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి నగరంలోని లాల్చౌక్ ప్రాంతంలో అణువణువు గాలించాయి. హోటళ్లు తనిఖీ చేశారు. స్థానిక పోలీసులు డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సదస్సు ముగిసేదాకా శ్రీనగర్ నగరాన్ని ‘నో డ్రోన్’జోనుగా ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు తిరుగాడే మార్గాలను అందంగా అలంకరించారు. అనుమానాస్పద అంతర్జాతీయ ఫోన్కాల్స్, వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కశ్మీర్ పోలీసులు సూచనలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.