Vaccination: ‘భారత్లో 90 కోట్లు దాటిన డోసులు.. ‘జై అనుసంధాన్’ ఫలితమే’
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకెళ్తున్న భారత్.. ఈ క్రమంలో వరుస రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారానికి మొత్తం 90 కోట్ల డోసుల మైలురాయి దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు...
దిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకెళ్తున్న భారత్.. ఈ క్రమంలో వరుస రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారానికి దేశంలో మొత్తం డోసుల పంపిణీ 90 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భారత్లో కరోనా డోసుల పంపిణీ మొత్తం 90 కోట్లు దాటింది. లాల్బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ - జై కిసాన్’ నినాదం ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయీ ‘జై విజ్ఞాన్’ అని అన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ‘జై అనుసంధాన్’ అని పిలుపునిచ్చారు. దాని ఫలితమే ఈ భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం’ అని రాసుకొచ్చారు.
‘88.14 కోట్ల డోసులు సరఫరా చేశాం’
మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 88.14 కోట్ల డోసులు ఉచితంగా, డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్మెంట్ కేటగిరీలో సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వాటి వద్ద ఇంకా 5.28 కోట్ల డోసుల నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. పెద్ద మొత్తంలో టీకాల లభ్యత, సరైన ప్రణాళికల ద్వారా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే విషయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారిలో 69 శాతం మందికి కనీసం ఒక డోసు టీకా అందించినట్లు కేంద్రం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 25 శాతం మందికి రెండు డోసులూ పూర్తిచేసినట్లు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు