S400: పంజాబ్లో ఎస్-400 మోహరింపు.. ఏక కాలంలో ఇద్దరు శత్రువులపై గురి..!
మూడేళ్లపాటు భారత్ ఎదురు చూపులకు ముగింపు పడింది. ఇటీవల చేతికందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ పంజాబ్ వద్ద మోహరింపులు మొదలయ్యాయి. సాధారణంగా భారత్ ఆయుధ మోహరింపులపై అధికారక ప్రకటనలు చేయడం చాలా అరుదు.
భారత గగనతలానికి మరింత భరోసా
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
మూడేళ్లపాటు భారత్ ఎదురుచూపులకు ముగింపు పడింది. ఇటీవల చేతికందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ పంజాబ్ వద్ద మోహరించడం ప్రారంభించింది. సాధారణంగా భారత్ ఆయుధ మోహరింపులపై అధికారక ప్రకటనలు చేయడం చాలా అరుదు. ఎస్-400ల మోహరింపును రక్షణమంత్రిత్వ శాఖ వర్గాలు పలు ఆంగ్ల పత్రికల వద్ద ధ్రువీకరించాయి. ‘‘ఎస్-400 ట్రయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ తొలి స్క్వాడ్రన్ను పంజాబ్ సెక్టార్లో మోహరిస్తున్నారు ’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు కొద్ది వారాల ముందే ఎస్-400 తొలిబ్యాచ్ ఎగుమతులు మొదలు పెట్టినట్లు రష్యా ఫెడరల్ సర్వీస్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్(ఎఫ్ఎస్ఎంటీసీ)కు చెందిన దిమిత్రి షుగేవ్ అనే అధికారి వెల్లడించారు.
అసలు ఈ ఎస్-400 ఏమిటీ..?
ఎస్-400 ట్రయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ. నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకొనేందుకు రష్యా దీనిని వాడుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళతం చేసిన ఓ ప్యాకేజ్ అన్నమాట. దీనిని 2007 సంవత్సరంలో రష్యా సైన్యంలోకి ప్రవేశపెట్టింది. అదే ఏడాది జులైలో ఆకాశంలో సెకన్కు 2,800 మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఎస్-400 ఛేదించినట్లు రష్యా పేర్కొంది.
ఏఏ ఆయుధాలు ఉంటాయి..?
* ఉరాల్-532301 హెవీడ్యూటీ ట్రక్పై అమర్చిన మొబైల్ కమాండ్ పోస్ట్ ఉంటుంది. ఇది ఏక కాలంలో ఎనిమిది క్షిపణులను సమన్వయపర్చగలదు.
* ‘బిగ్బర్డ్’ బ్యాటిల్ అక్విజేషన్ అండ్ ఎంగేజ్మెంట్ రాడార్ను ఇస్తారు. ఇది అత్యధికంగా 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. దీని రక్షణకు ‘ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మెజర్స్’ (ఈసీసీఎం) సూట్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, జామింగ్లను తట్టుకోగలదు.
* ‘గ్రేవ్స్టోన్’ ఎంగేజ్మెంట్ అండ్ ఫైర్ కంట్రోల్ రాడార్ ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వాడే మల్టీ ఫంక్షన్ రాడార్. ఏకకాలంలో 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ముందు ఛేదించాల్సిన లక్ష్యాలను గుర్తించి వాటికి ఆటోమేటిక్గా ప్రాధాన్యం ఇస్తుంది. ఎస్-400 వ్యవస్థలోని మిసైల్ లాంఛర్లకు ఆదేశాలు ఇస్తుంది. అంతేకాదు. క్షిపణి ప్రయాణించే క్రమంలో దానికి లక్ష్యాలకు సంబంధించిన గైడెన్స్ ఇస్తుంది. దీని రక్షణకు ఈసీసీఎం సూట్ కూడా ఉంది.
* ‘చెస్బోర్డ్’ ఆల్-ఆల్టిట్యూడ్ అక్విజేషన్ రాడార్ కూడా ఉంటుంది. దీనిలో ఆప్షనల్ 3డీ ఎర్లీ వార్నింగ్ అండ్ అక్విజేషన్ వ్యవస్థలు ఉన్నాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఈ రాడార్ను వాడి లాంఛర్లకు లక్ష్యాలను సూచించవచ్చు.
* ‘చెస్బోర్డ్’ ఆల్-ఆల్టిట్యూడ్ అక్విజేషన్ రాడార్కు అనుబంధంగా రాడర్లను అమర్చేందుకు మొబైల్ మాస్ట్ సిస్టమ్ (మొబైల్ టవర్ వంటిది) ఉంటుంది.
* నాలుగు మిసైల్ ట్యూబ్స్ ఉన్న మొబైల్ లాంఛర్లు ఉంటాయి. ఇవి ఒక్కో స్క్వాడ్రన్లో 16 వరకు ఉన్నాయి . భారత్ ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయడంతో మొత్తం 80 లాంఛర్లు మనకు లభించనున్నాయి.
* ఎస్-400లో మొత్తం ఐదు రకాల క్షిపణులను వినియోగిస్తున్నారు. భారత్ కచ్చితంగా వేటిని కొనుగోలు చేసిందో వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. కానీ, వీటి రేంజి 400 కిమీ, 250 కిమీ, 200 కిమీ, 120 కిమీ, 40కిమీ.
* లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్ఎస్) ప్రతి వ్యవస్థలో ఉంటుంది. దీనిలో క్షిపణులు భద్రపర్చేందుకు, నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. వీటిల్లో క్షిపణుల లోడింగ్కు అవసరమైన పరికరాలు కూడా ఉంటాయి.
పంజాబ్ సెక్టార్లో ఎందుకు మోహరించారు..?
ఎస్-400 వ్యవస్థలోని రాడార్లు 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలవు. దీనిని కేవలం 5 నిమిషాల్లో దాడికి సిద్ధం చేయవచ్చు. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ, కశ్మీర్, నియంత్రణ రేఖ దీని పరిధిలోకి వచ్చేలా పంజాబ్ సెక్టార్లో మోహరిస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా సరిహద్దులకు, దేశంలోని కీలక ప్రాంతాలకు ఈ గగనతల రక్షణ వ్యవస్థ అండగా ఉంటుంది. ఈ వ్యవస్థలోని క్షిపణి లాంఛర్లన్నీ దళాల వ్యూహాలకు అనుకూలంగా వేర్వేరు చోట్ల మోహరించే వెసులుబాటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం