Coronavirus: భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంది.. మరో వైరస్ ఉప్పెన రాకపోవచ్చు..!
చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘BF.7’ కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ అన్నారు.
దిల్లీ: చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో మరోమారు కరోనావైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ప్రస్తుత వేరియంట్ల విషయంలో కలవరపడాల్సిన పనిలేదని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్దీప్ కాంగ్ అన్నారు. మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందని.. మరో వైరస్ ఉప్పెన రాకపోవచ్చని అంచనా వేశారు.
‘ప్రస్తుతం భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. మన దగ్గర స్వల్ప స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు XBB, BF.7 బయటపడ్డాయి. కానీ వాటివల్ల కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. ఇంతకంటే అధికస్థాయిలో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చేసే వేరియంట్ లేకపోవడంతో మరో వైరస్ ఉప్పెన ఉండకపోవచ్చు’ అని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా.. చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘BF.7’ కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. కేసులతోపాటు కొవిడ్ మరణాలూ భారీగానే ఉన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనిపై కాంగ్ స్పందించారు. ‘ఇప్పటికే మన దేశం చవిచూసిన విషాదాన్ని చైనా ఎదుర్కోంటోంది. అయితే దాంతోపాటు మనకు ఆందోళన కలిగించే విషయం మరొకటి ఉంది. వైరస్ భారీ స్థాయిలో వ్యాప్తి చెందుతుంటే.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్