International Tiger Day: నాలుగేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు: మోదీ
పులుల ఆవాసాల సంరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పులుల ఆవాసాల సంరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్వీట్లు చేసిన మోదీ, ఆవాసాల సంరక్షణతో పాటు పులులకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పులుల సంరక్షణలో భాగంగా స్థానిక ప్రజలను మమేకం చేయడాన్ని ప్రధాన అంశంగా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు మోదీ తెలిపారు. భారతీయులు సనాతన కాలం నుంచీ, ఈ గ్రహంపై ఉండే అన్ని జీవ జాతులతో ఘర్షణ లేకుండా జీవిస్తూ వస్తున్నారని అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న పులులో 70 శాతం భారత్లోనే ఉన్నాయన్న మోదీ అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని వాటి సంరక్షణకు పాటుపడుతున్న వారికి అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల పరిధిలో పులుల అభయారణ్యాలు 51 ఉండగా 2018 లెక్కల ప్రకారం పులుల సంఖ్య గణనీయంగా పెరిగాయని తెలిపారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఒడంబడికకు కట్టుబడి భారత్ నాలుగేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు కృషి చేసిందని మోదీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్