Amit Shah: అమెరికా, ఇజ్రాయెల్ల సరసన భారత్.. అమిత్షా కీలక వ్యాఖ్యలు
తమ సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకునే వారిని తిప్పికొట్టే అమెరికా, ఇజ్రాయెల్ల సరసన భారత్ కూడా చేరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఉరి, పుల్వామాల్లో ఉగ్రదాడుల అనంతరం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక...
బెంగళూరు: తమ సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకునే వారిని తిప్పికొట్టే అమెరికా, ఇజ్రాయెల్ల సరసన భారత్ కూడా చేరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఉరి, పుల్వామాల్లో ఉగ్రదాడుల అనంతరం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడల్లా కేంద్రం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యేదని, అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. ‘గతంలో అమెరికా, ఇజ్రాయెల్.. ఈ రెండు దేశాలు మాత్రమే తమ సరిహద్దులు, సైన్యం విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నప్పుడు ప్రతీకారం తీర్చుకునేవి. ఇప్పుడు భారత్ ఈ జాబితాలో చేరింది’ అని అన్నారు. కర్ణాటకలో మంగళవారం నృపతుంగ విశ్వవిద్యాలయంతోపాటు వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం షా ఈ మేరకు ప్రసంగించారు.
‘పాక్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు ఎలాంటి ప్రభావం చూపాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈ దాడుల ప్రభావం చాలా ఉంటుంది. ‘భారత సమగ్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు. లేనిపక్షంలో.. వారికి తగిన గుణపాఠం దక్కుతుంద’ని ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది’ అని మంత్రి అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలవడంపై.. సీఎం బసవరాజ్ బొమ్మైకి అభినందనలు తెలిపారు. ఈ విద్యావిధానం భారత్ను గొప్ప దేశంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని.. ప్రపంచంతో పోటీపడేలా యువతకు ఓ వేదికను అందిస్తుందన్నారు. ఇది ప్రాంతీయ భాషలకూ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే సమయానికి భారత్ 'విశ్వగురువు'గా మారాలని యువతకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ