అక్కడి భారతీయులు కాస్త జాగ్రత్త!
మయన్మార్లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మయన్మార్లో ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యసరమైత.......
మయన్మార్లోని ఇండియా రాయబార కార్యాలయం సూచన
దిల్లీ: మయన్మార్లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మయన్మార్లో ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. సైనిక పాలన నేపథ్యంలో అక్కడి భారత పౌరులంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. విమాన సర్వీసులు సైతం రద్దు కావడంతో యంగూన్-దిల్లీ మధ్య నడవాల్సిన ఎయిరిండియా సర్వీసుని సైతం వాయిదా వేశారు.
మయన్మార్లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఒకే ఒక్క సాకుతో సోమవారం తెల్లవారుజామున అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశంలో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) కీలక నేత ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మింట్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరినీ సైన్యం నిర్బంధించింది. సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ ఇక నుంచి సర్వాధికారాలు చెలాయించనున్నారు. ప్రపంచదేశాలు మయన్మార్ సైనిక తిరుగుబాటుని తీవ్రంగా ఖండించాయి. వెంటనే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించాయి. మరోవైపు ఈ అంశాన్ని ఐరాస భద్రతా మండలిలో చర్చించాలని ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయించింది. మంగళవారం ప్రారంభం కాబోయే సమావేశాల్లో దీనిపై రహస్యంగా చర్చించనున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్