Modi-Kishida: భారత పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!
జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) భారత ప్రధాని మోదీతో (Narendra Modi) భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్న కిషిదా.. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.
దిల్లీ: భారత పర్యటనలో భాగంగా జపాన్ (Japan) ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) సోమవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. భారత్-జపాన్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఇరువురు నేతలు విస్తృత అంశాలపై చర్చలు జరిపినట్లు పీఎం కార్యాలయం వెల్లడించింది. సుమారు 27గంటల పాటు కిషిదా పర్యటన భారత్లో కొనసాగనుంది. ఉక్రెయిన్ సంక్షోభంతోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు ప్రదర్శిస్తోన్న సమయంలో తాజా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
‘భారత్-జపాన్ల మధ్య వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైంది. జీ20కి భారత్, జీ7కు జపాన్ అధ్యక్షత వహిస్తోన్న సమయంలో కలిసి పని చేయడమనేది మంచి అవకాశం. భారత అధ్యక్షతన జరుగుతోన్న జీ20 సదస్సుకు సంబంధించి ప్రాధాన్యాలను పీఎం కిషిదాకు వివరించా. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాం. రక్షణ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నాం. సెమీ కండక్టర్ల సరఫరా గొలుసుతోపాటు ఇతర ముఖ్యమైన సాంకేతికతలపై చర్చలు జరిపాం’ అని కిషిదాతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్కు సంబంధించిన ప్రణాళికను భారత్లోనే వెల్లడిస్తానని అన్నారు. భారత్తో తమ ఆర్థిక సహకారం అభివృద్ధికి దోహదం చేయడంతోపాటు జపాన్కూ ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు మాట్లాడిన ఇరు దేశాల ప్రతినిధులు.. రక్షణ, భద్రత వంటి అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. శాంతియుత, స్థిరత్వ, సుసంపన్నమైన ప్రపంచం కోసమే ఇరుదేశాలు ఈ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం