- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కరోనా కల్లోలం: బ్రెజిల్ను దాటేసిన భారత్
దిల్లీ: నిత్యం లక్షకుపైగా కొత్త కేసులతో భారత్లో కరోనా వైరస్ బుసలు కొడుతోంది. తాజాగా 1,68,912 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో ఇప్పటి వరకు వైరస్ బారిన పడినవారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా అమెరికా తరవాత వైరస్ కల్లోలానికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి చేరింది.
వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. మొత్తం కేసులపరంగా చూస్తే అమెరికాలో 3,19,18,591 మందికి కరోనా సోకింది. భారత్లో ఆ సంఖ్య కోటీ 35లక్షల మార్కును దాటగా.. బ్రెజిల్ తరవాత స్థానంలో ఉంది. ఆ దేశంలో 1,34,82,543 మంది మహమ్మారి బారినపడ్డారు. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్లో కూడా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే అమెరికాలో 5,75,829, బ్రెజిల్లో 3,53,293, మెక్సికోలో 2,09,212 మంది మరణించారు. కేసుల పరంగా భారత్ రెండో స్థానంలో ఉండగా.. మృతులసంఖ్య పరంగా నాలుగో స్థానం(1.70లక్షలు)లో ఉంది. ప్రస్తుతం కేసులతో పాటే మరణాల సంఖ్యలో కూడా వృద్ధి కనిపిస్తుండటం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 904 మంది చనిపోయారు. ఈ క్రమంలో కొవిడ్ బాధితులతో వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా చూసేందుకు మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు లాక్డౌన్పై యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పలు రాష్ట్రాలు రాత్రికర్ఫ్యూ, కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై దృష్టిసారించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్వే..!
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్రెడ్డి అసహనం
-
Sports News
ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..