R-Value : 4కు చేరిన‘ఆర్నాట్’విలువ.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి కేసులు
దేశంలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో.. మూడో వేవ్ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు వారాల కొవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్ బృందం.. తాజాగా కీలక విషయాలు...
ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణలో వెల్లడి
చెన్నై: దేశంలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో.. మూడో వేవ్ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు వారాల కొవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్ బృందం.. తాజాగా కీలక విషయాలు వెల్లడించింది. కంప్యూటేషనల్ మోడలింగ్ ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. దేశంలో ‘ఆర్నాట్’ విలువ డిసెంబర్ 25- 31 మధ్య 2.9 ఉండగా.. జనవరి 1-6 మధ్య ఏకంగా 4గా నమోదైందని తెలిపింది. దేశంలో మహమ్మారి రెండో వేవ్ పీక్ దశలో నమోదైన 1.69 కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ‘ఆర్నాట్’గా పేర్కొంటారు. ఈ విలువ ఒకటి దాటడం ఏమాత్రం సానుకూల పరిణామం కాదని నిపుణులు చెబుతుంటారు. గత బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ సైతం దేశ ఆర్నాట్ విలువ 2.69గా ఉందని తెలిపింది.
మరోవైపు దేశంలో ప్రస్తుత వేవ్.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఈ బృందం అంచనా వేసింది. ఐఐటీ మద్రాస్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా ఈ విషయమై మాట్లాడుతూ.. ఆర్నాట్ అనేది సంక్రమణ సంభావ్యత, కాంటాక్ట్ రేటు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే.. క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షల విధింపు కారణంగా కాంటాక్ట్ రేట్ తగ్గి, ఆర్నాట్ విలువా పడిపోవచ్చన్నారు. ఆర్నాట్ విలువ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన దానికంటే భిన్నంగా ఉండటంపై వివరణ ఇస్తూ.. ఈ రెండు అంచనాలు వేర్వేరు టైం ఇంటర్వెల్పై ఆధారపడి ఉన్నాయని, తాము కేవలం గత రెండు వారాలకు సంబంధించిన వివరాలపై ప్రాథమిక విశ్లేషణ చేసినట్లు చెప్పారు. మరోవైపు వ్యాక్సినేషన్ రేటు, మొదటి రెండు వేవ్లతో పోల్చితే ఈసారి తక్కువ సామాజిక దూరం పాటిస్తుండటం వంటి కారణాలతో.. ప్రస్తుత వేవ్ మునుపటివాటి కంటే భిన్నంగా ఉంటుందని ఝా వెల్లడించారు. ఈసారి జనాభాలో దాదాపు 50 శాతం మందికి టీకాలు పూర్తికావడం కూడా కలిసొచ్చే అంశమని చెప్పారు.
మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది. వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. నిన్న 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు