Lac: చైనా విషయంలో భారత్.. ఏమాత్రం తగ్గేదేలే..!
వాస్తవాధీన రేఖ వద్ద సంక్షోభం రెండో ఏడాది పూర్తి చేసుకొనే దిశగా వెళుతోంది. భారత సైన్యం చైనాతోపాటు శీతాకాలాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు
మరో శీతాకాలం ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వాస్తవాధీన రేఖ వద్ద సంక్షోభం రెండో ఏడాది పూర్తి చేసుకునే దిశగా వెళుతోంది. భారత సైన్యం చైనాతోపాటు శీతాకాలాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు చకచక ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక్కడ శీతాకాలంలో దాదాపు మైనస్ 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న తప్పు చేసినా.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎల్ఏసీ వద్ద దళాలు మోహరించాయి. భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
అక్టోబర్లో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే మాట్లాడుతూ ‘తూర్పు లద్దాఖ్లో చైనా వైపు సైనిక మోహరింపులు, సరికొత్త నిర్మాణాలు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఒక వేళ చైనా సేనలు అక్కడే కొనసాగితే భారత్ దళాలు వెనక్కి తగ్గే అవకాశమే లేదు’ అని స్పష్టం చేశారు. భారత్ ఇప్పటికే 50,000 మందికిపైగా సైనికులను, శతఘ్నులు, ప్రధాన యుద్ధ ట్యాంకులు, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్, ఉపరితలంపై నుంచి గగనతలంపైకి వేగంగా దాడిచేయగల క్షిపణులు, ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, పినాకా మల్టీబ్యారెల్ రాకెట్ లాంఛర్లు, సాయుధ వాహనాలు, హై మొబిలిటీ వెహికల్స్ను తరలించింది.
ఒక్కో సైనికుడిపై ఆరు నెలల్లో రూ.11 లక్షలు..
సరిహద్దు రక్షణకు సైనిక మోహరింపుల్లో భారత్ ఏమాత్రం వెనకాడటం లేదు. బలగాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాలను రేయింబవళ్లు సరిహద్దులకు తరలిస్తోంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ప్రతి సైనికుడిపై 15,000 డాలర్లు ( రూ.11 లక్షలు) వెచ్చించనుంది. సైనిక రవాణా విభాగంలో నిపుణులైన మేజర్ జనరల్ అమృత్పాల్ సింగ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. సైన్యానికి శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు రేషన్, ఔషధాలు, ఇంజినీరింగ్ పరికరాలు, మందుగుండు, ఇతర పరికరాలు, దుస్తులు, అతిశీతల పరిస్థితుల్లో వినియోగించే వాహనాలు తరలిస్తున్నామని చెప్పారు.
ప్రతి సైనికుడికి మొత్తం 80 రకాల ఐటమ్స్ అవసరం. సైనికులు ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, వాహనాల వినియోగానికి భారీగా కిరోసిన్, ప్రత్యేకమైన డీజిల్, పెట్రోల్ వంటివి తప్పనిసరి. ఈ క్రమంలో సరిహద్దులకు 50 లక్షల టన్నుల వస్తువులను భారత ప్రభుత్వం పంపిస్తోంది.
సీ-17 విమానానికి గంటకు రూ.2.5 కోట్లు..
ఈ సరఫరాల్లో అవసరాలను బట్టి కొన్నింటిని తప్పనిసరిగా విమానాల్లో పంపాల్సిందే. మరికొన్ని ట్రక్కుల్లో వెళతాయి. ట్రక్కులో 10 టన్నుల సరుకుల చేరవేతకు ట్రిప్పుకు రూ. 1.1లక్షలు వెచ్చించాలి. 50 టన్నులు మోయగల సీ-17 ఎయిర్ క్రాఫ్ట్ గంటసేపు ప్రయాణానికి రూ.2.5 కోట్లు ఖర్చవుతుంది.
వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైనికులను చలి నుంచి రక్షించేందుకు ప్రత్యేకమైన క్యాంపులను ఏర్పాటు చేసింది. వీటికి విద్యుత్తు, మంచినీరు, క్యాంపును వేడిగా ఉంచే హీటర్లు వంటి సౌకర్యాలను కల్పించారు. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ పొడవునా వీటిని నిర్మించారు. ఇందుకోసం రూ.738 కోట్లు వెచ్చించారు. వీటికి అదనంగా మరిన్ని బంకర్లు అవసరమని సైనికాధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలను కూడా చలి బారి నుంచి రక్షించేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు.
నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు
దట్టంగా కురిసే మంచులో గస్తీకాయడం అంత తేలికకాదు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్, లక్ష్యాలపై నిఘా వంటి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం టాక్టికల్ డ్రోన్స్, రికానసన్స్ అండ్ అబ్జర్వేషన్ సిస్టమ్స్, బ్యాటిఫీల్డ్ రాడార్స్, దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలను కూడా వినియోగించేందుకు సిద్ధం చేశారు. వచ్చే రెండేళ్లలో భారత ఈ సామర్థ్యాలను మరింత పెంచుకొనేందుకు రూ.3.6 వేల కోట్లు వెచ్చించవచ్చు.
భారత్తో వివాదం.. చైనా సైనికులకు అనుభవం..!
ఇటీవల అమెరికా రక్షణశాఖ ఇచ్చిన నివేదికలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారత్తో ఘర్షణ కారణంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కీలకమైన అనుభవాన్ని సంపాదించుకుంటోందని పేర్కొంది. బలగాల తరలింపు, మోహరింపు, వాస్తవిక పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ వంటి అంశాలను పీఎల్ఏ తెలుసుకుంటోందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్