India Corona: లక్షకు చేరువగా క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనావైరస్(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Updated : 29 Jun 2022 10:02 IST

3.35 శాతానికి పాజిటివిటీ రేటు.. కొత్త కేసులెన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనావైరస్(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14 వేల మందికి కరోనా సోకగా.. దేశంలో బాధితుల సంఖ్య(Active Cases) లక్షకు చేరువైంది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

మంగళవారం 4.33 లక్షల మందికి కొవిడ్(Covid-19)నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,506 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఆ సంఖ్య 11,793గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.35 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 2020 ప్రారంభం నుంచి 4.34 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.25 లక్షల మందికి పైగా మృతి చెందారు. 

ప్రస్తుత వ్యాప్తి ప్రభావం క్రియాశీల కేసులపై కనిపిస్తోంది. వాటి సంఖ్య(వైరస్‌ బాధితులు) 99,602(0.23శాతం)కి చేరి.. ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు 98.56 శాతానికి పడిపోయింది. నిన్న 11,574 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 197 కోట్లకుపైగా డోసుల పంపిణీ కాగా.. అందులో 13.44 లక్షల మంది నిన్న టీకా తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని