India Corona: అదుపులో కరోనా.. తగ్గిన క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనావైరస్ అదుపులో ఉంది. మరోరోజు కొత్త కేసులు తగ్గి.. 14 వేలకు పడిపోయాయి. తాజాగా 4.26 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,830 మందికి వైరస్ సోకింది.

Published : 26 Jul 2022 10:06 IST

గణాంకాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: దేశంలో కరోనావైరస్ అదుపులో ఉంది. రోజువారీ కేసులు తగ్గి.. 14 వేలకు పడిపోయాయి. తాజాగా 4.26 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,830 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 4.39 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.32 కోట్ల(98.47 శాతం) మంది కోలుకున్నారు. 

రెండురోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియశీల కేసులు 1,47,512(0.34 శాతం)లక్షలకు పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో 18,159 మంది కోలుకున్నారు. 36 మంది మరణించారు. నిన్న 30.42 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకూ 202.50 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు