India Corona: అదుపులోనే మహమ్మారి.. కొత్త కేసులెన్నంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. మంగళవారం 4.54 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,159 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.

Published : 06 Jul 2022 09:59 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. మంగళవారం 4.54 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,159 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ కట్టడిలోనే ఉండగా.. తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 15,394 మంది కోలుకున్నారు. 28 మంది మరణించారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,15,212(0.26 శాతం)కి పెరిగాయి. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.29 కోట్ల మంది(98.53 శాతం) కోలుకున్నారు. 5.25 లక్షల మరణాలు సంభవించాయి. నిన్నటివరకూ 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని