India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!

స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు కాస్త తగ్గి.. 18 వేల నుంచి 17 వేలకు దిగొచ్చాయి.

Published : 01 Jul 2022 09:57 IST

0.25 శాతానికి క్రియాశీల రేటు

దిల్లీ: స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు కాస్త తగ్గి.. 18 వేల నుంచి 17 వేలకు దిగొచ్చాయి. నిన్న 5.02 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,070 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.40 శాతంగా నమోదైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోందని శుక్రవారం ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. 

దాంతో క్రియాశీల కేసులు 1,07,189(0.25 శాతం)కి ఎగబాకాయి. నిన్న 14,413 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.55 శాతంగా నమోదైంది. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 4.28 కోట్ల మంది కోలుకున్నారు. 5.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 23 మంది మరణించారు. ఇక ఇప్పటివరకూ 197 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని