India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,092 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది.

Published : 02 Jul 2022 10:22 IST

కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,092 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. మరోరోజు 17 వేల ఎగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరింది. కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో నమోదవుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లో వైరస్ విజృంభణ కనిపిస్తుండగా.. దిల్లీలో మాత్రం కేసులు వెయ్యి దిగువకు చేరాయి. 2020 ప్రారంభం నుంచి 4.34 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుత వ్యాప్తితో క్రియాశీల కేసులు 1,09,568కి ఎగబాకాయి. దాంతో క్రియాశీల కేసుల రేటు 0.25 శాతానికి చేరింది. నిన్న 14,684 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 5.25 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ వైరస్‌ కట్టడికి గత ఏడాది నుంచి కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం కింద 197 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో నిన్న 9.09 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని