India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,092 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరోరోజు 17 వేల ఎగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరింది. కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో నమోదవుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్లో వైరస్ విజృంభణ కనిపిస్తుండగా.. దిల్లీలో మాత్రం కేసులు వెయ్యి దిగువకు చేరాయి. 2020 ప్రారంభం నుంచి 4.34 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుత వ్యాప్తితో క్రియాశీల కేసులు 1,09,568కి ఎగబాకాయి. దాంతో క్రియాశీల కేసుల రేటు 0.25 శాతానికి చేరింది. నిన్న 14,684 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 5.25 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ వైరస్ కట్టడికి గత ఏడాది నుంచి కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం కింద 197 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో నిన్న 9.09 లక్షల మంది టీకా తీసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
-
World News
Sri Lanka Crisis: శ్రీలంకవాసులకు ‘షాక్’! విద్యుత్ ధరల్లో 264 శాతం పెంపు
-
Sports News
Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
-
India News
Corona: ఖర్గేకు మళ్లీ కరోనా పాజిటివ్.. నిన్న రాజ్యసభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత!
-
General News
Headaches: గర్భిణికి తలనొప్పా..? వస్తే ఏం చేయాలో తెలుసుకోండి..!
-
World News
Seoul: సియోల్లో కుంభవృష్టి.. ఎనిమిది మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్