India Corona: కొత్త కేసులు, రికవరీలు.. 19 వేలే..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 3.91 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 19,406 మందికి వైరస్ సోకింది.

Updated : 06 Aug 2022 10:01 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 3.91 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 19,406 మందికి వైరస్ సోకింది. 49 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 4.96 శాతానికి చేరిందని కేంద్రం వెల్లడించింది. నిన్న దిల్లీలో 2,419 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,928 మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.34 లక్షలకు చేరుకున్నాయి. క్రియాశీల రేటు 0.31 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. నిన్న 32.7 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 205 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని