మళ్లీ 200కు చేరువలో కరోనా మరణాలు..!

భారత్‌లో కరోనా వైరస్‌ మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 188 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య సోమవారం నాడు 24వేలు ఉండగా..

Updated : 17 Mar 2021 11:04 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 188 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య సోమవారం నాడు 24వేలు ఉండగా.. మంగళవారం నాడు ఆ సంఖ్య 28వేలకు పైగా నమోదైంది. మొత్తం 9.69లక్షల పరీక్షలు చేయగా.. 28,903 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,457,284కు చేరి.. రికవరీ రేటు 96.65 శాతంగా కొనసాగుతోంది.

ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,044కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  2,34,406 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 21లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,50,64,536కి చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని