India Corona: స్పల్పంగా తగ్గిన కొత్త కేసులు.. 29 మరణాలు

స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 3.36 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,307 మందికి వైరస్ పాజిటివ్‌గా వచ్చింది.

Published : 09 May 2022 09:58 IST

దిల్లీ: స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 3.36 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,207 మందికి వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. ముందురోజు కంటే ఏడు శాతం మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 29 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడగా.. 5.24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 20,403కి చేరాయి. నిన్న 3,410 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతుండగా.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న 13 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని