India Corona: గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. ఎన్నొచ్చాయంటే..?

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ముందురోజు 14 వేలుగా ఉన్న కేసులు..తాజాగా తొమ్మిది వేల దిగువకు తగ్గాయి.

Published : 16 Aug 2022 10:15 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ముందురోజు 14 వేలుగా ఉన్న కేసులు..తాజాగా తొమ్మిది వేల దిగువకు తగ్గాయి. సోమవారం 2.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,813 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 15,040 మంది కోలుకున్నారు. 29 మంది మరణించారు. 2020 ప్రారంభం నుంచి 4.42 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.46 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.11 లక్షల(0.25 శాతం)కు పడిపోయాయి. ఇప్పటివరకూ 208 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 6.10 లక్షల మంది టీకా తీసుకున్నారని మంగళవారం కేంద్రం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు