Corona: 12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారంలో రెట్టింపైన కేసులు

దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు పైనే నమోదవుతున్నాయి. గతవారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి

Updated : 25 Apr 2022 10:07 IST

దిల్లీ: దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు పైనే నమోదవుతున్నాయి. గతవారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అంతక్రితం వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. ఇక కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 16వేలు దాటింది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.02లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,541 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84శాతంగా ఉంది.

ఇదే సమయంలో 1,862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75శాతంగా ఉంది.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,522 మంది కరోనాతో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 0.04శాతంగా ఉంది.

* నిన్న మరో 30 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5,22,223 మందిని మహమ్మారి బలితీసుకుంది.

* ఏప్రిల్‌ 18-24 మధ్య దేశవ్యాప్తంగా 15,700లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం వారంలో కేవలం 8వేల కేసులు నమోదవ్వగా.. గతవారం కొత్త కేసుల సంఖ్య 95శాతం పెరగడం గమనార్హం.

* ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 3.64లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని