China-Pak-India: మా అంతర్గత వ్యవహారంలో తలదూర్చొద్దు!
జమ్ముకశ్మీర్పై ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్కు.. ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న చైనాకు భారత్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. భారత అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని స్పష్టం చేసింది. ఇటీవల జమ్ముకశ్మీర్కు సంబంధించి చైనా-పాకిస్థాన్ చేసిన
చైనా, పాకిస్థాన్కు భారత్ హెచ్చరిక
దిల్లీ: జమ్ముకశ్మీర్ అంశంలో ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్కు, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న చైనాకు భారత్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల జమ్ముకశ్మీర్కు సంబంధించి చైనా-పాకిస్థాన్ చేసిన సంయుక్త ప్రకటనపై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ.. భారత అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది.
చైనా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 6న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)పై చర్చించారు. అలాగే, జమ్మూకశ్మీర్ ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. అనంతరం జిన్పింగ్ మాట్లాడుతూ ‘‘ఐక్యరాజ్య సమితి సూచనలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా కశ్మీర్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి’’అని సూచించారు. పరిస్థితిని తీవ్రతరం చేసే ఏకపక్ష చర్యలను చైనా ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియానే మా ఉమ్మడి అజెండా’’ అని చైనా, పాక్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ ప్రకటనపై తాజాగా విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి మాట్లాడుతూ.. ‘‘చైనా-పాకిస్థాన్ సంయుక్త ప్రకటనలో ఇచ్చిన సూచనలను తిరస్కరిస్తున్నాం. భారత్ స్థాయి ఏంటో చైనా, పాకిస్థాన్కు బాగా తెలుసు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత భూభాగాలే. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఆ రెండు దేశాలు జోక్యం చేసుకోవని భావిస్తున్నాం. పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగంలో చైనా-పాకిస్థాన్ కారిడార్ ప్రాజెక్టులపై మా వ్యతిరేకతను తెలియజేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చడానికి పాకిస్థాన్తోపాటు ఏ దేశం ప్రయత్నించినా మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అందుకే, అటువంటి కార్యకలాపాలను నిలిపివేయాలి’’ అని అరిందమ్ బగ్చి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు