స్పుత్నిక్ టీకా రాక మరింత ఆలస్యమేనా..?
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ భారత్ చేరుకోవడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్ టీకాలు మే చివరినాటికి భారత్ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.
దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ భారత్ చేరుకోవడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్ టీకాలు మే చివరి నాటికి భారత్ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. దీంతో భారత్లో టీకా పంపిణీని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమని నిపుణులు భావిస్తున్నారు.
‘రష్యా నుంచి స్పుత్నిక్ టీకా తొలి బ్యాచ్ను ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మే నెల చివరినాటికి వీటిని దిగుమతి చేసుకునేందుకు మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని భారత్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించింది. అంతేకాకుండా స్పుత్నిక్ టీకా తయారీని భారత్లో మరికొన్ని నెలల్లోనే ప్రారంభిస్తామని తెలిపింది. భారత్లో తయారయ్యే స్పుత్నిక్ టీకా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ నెలలోనే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమవుతుందని రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ గతవారం వెల్లడించారు. అయినప్పటికీ టీకా దిగుమతి ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, స్పుత్నిక్ టీకాను భారత్లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు ఆర్డీఐఎఫ్ గతేడాది సెప్టెంబర్లోనే డాక్టర్ రెడ్డీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా.. దాదాపు 1600 మంది వాలంటీర్లపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను డాక్టర్ రెడ్డీస్ నిర్వహించింది. అనంతరం అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకోగా.. ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి ఏప్రిల్ 12న పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ పంపిన సిఫార్సులను పరిశీలించిన డీసీజీఐ.. భారత్లో స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో భారత్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్తో పాటు మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. ఇక స్పుత్నిక్ టీకాను ఆమోదించిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు ఆర్డీఐఎఫ్ పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లలో స్పుత్నిక్-వి రెండో స్థానంలో ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!