Boris Johnson: నా భుజంలో ఉన్నది భారత్ టీకా : బ్రిటన్ ప్రధాని
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తోన్న ప్రయత్నాలను బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రశంసించారు.
నరేంద్ర మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ద్వైపాక్షిక చర్చలు
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తోన్న ప్రయత్నాలను బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను కూడా భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్నానన్న ఆయన.. అది తనను సురక్షితంగా ఉంచుతోందన్నారు. ఈ విషయంలో భారత్కు ధన్యవాదాలు చెప్పిన జాన్సన్.. ప్రపంచ ఫార్మసీగా భారత్ ఎదుగుతోందని కొనియాడారు. భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆ వివరాలను మీడియాతో పంచుకున్న ఇరువురు నేతలు.. భారత్, బ్రిటన్ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తున్నాయని చెప్పారు. వీటితోపాటు రక్షణ, భద్రతా రంగాల్లో పలు విషయాలపై అంగీకారానికి వచ్చినట్లు ఇద్దరు ప్రధానులు పేర్కొన్నారు.
స్వేచ్ఛా వాణిజ్యంపై ముందడుగు
‘వివిధ రంగాల్లో ఇరు దేశాల దృఢమైన సంబంధాల్లో భాగంగా 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలపై సమీక్ష జరిపాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. వీటిని ఈ ఏడాది చివరి నాటికి ముగించేందుకు కృషి చేయాలని నిర్ణయించాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ స్వేచ్ఛాయుత, దాపరికం లేని, కలుపుకొనిపోయేతత్వంతో నిబంధనలకు లోబడి వాణిజ్యం చేసే ఆవశ్యకతను నొక్కిచెప్పాం. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన ప్రాముఖ్యతను ప్రధానంగా చర్చించాం. ఇదే సమయంలో శాంతియుత, సుస్థిర అఫ్గానిస్థాన్కు మా మద్దతు ఇస్తున్నాం’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సచిన్, అమితాబ్లా అనిపించింది..
ద్వైపాక్షిక చర్చలపై మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ‘తాము అద్భుతమైన చర్చలు జరిపాం. ఇరుదేశాల సంబంధాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయి. రక్షణ, భద్రతా రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యంలో పలు ఒప్పందాలు చేసుకున్నాం’ అని వివరించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో జరిగిన ‘గార్డ్ ఆఫ్ హానర్’ స్వీకరించిన బోరిస్ జాన్సన్.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-బ్రిటన్ల స్నేహబంధం అత్యంత పురాతనమైనదన్నారు. గతంలో ఎన్నడూ లేనంత దృఢంగా ఇరు దేశాల సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. తనకు భారత్లో లభించిన ఆదరణ ప్రపంచంలో ఇంకెక్కడా లభించలేదన్నారు. భారీ హోర్డింగులతో తనకు ఘన స్వాగతం పలికిన తీరు చూసి.. సచిన్ తెందుల్కర్, అమితాబ్ బచ్చన్లా అనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన బోరిస్.. మోదీ తనకు ప్రత్యేక మిత్రుడంటూ అభివర్ణించారు.
మోదీ నాకు ప్రత్యేక మిత్రుడు..
భారత్లో తమ సంబంధాలు ప్రతి మార్గంలోనూ బలోపేతమయ్యాయని బోరిస్ జాన్సన్ అన్నారు. మోదీని తనకు ప్రత్యేకమైన మిత్రుడిగా అభివర్ణించారు. తన భారత పర్యటన ఇరు దేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిందన్నారు. విస్తృత రక్షణ, భద్రతా భాగస్వామ్యానికి ఇరు దేశాలూ అంగీకరించాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్లో తయారీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛయుతంగా ఉంచేందుకు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా బోరిస్ పిలుపునిచ్చారు. వివిధ రూపాల్లో ఎదురవుతున్న ముప్పును కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలన్నారు. వచ్చే వారంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభించనున్నట్టు బోరిస్ వెల్లడించారు.
చర్చల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్, బ్రిటన్ మధ్య గతేడాది సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ దశాబ్దంలో రెండు దేశాల సంబంధాలకు ఓ దిశ చూపేందుకు ఓ గొప్ప మార్గసూచీ 2030ని కూడా ప్రారంభించాం. ఆ మార్గ సూచీ వృద్ధిపై శుక్రవారం నాటి భేటీలో సమీక్షించాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల బృందాలు పనిచేస్తున్నాయి. చర్చల్లో చక్కని పురోగతి ఉంటోంది. ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తిచేసే దిశగా పూర్తి ప్రయత్నాలు చేయాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి’’ అన్నారు.
ఉక్రెయిన్లో మానవ సంక్షోభంపై మోదీ ఆందోళన: ష్రింగ్లా
ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధంతో రోజురోజుకీ పెరిగిపోతున్న మానవ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసినట్టు కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో చర్చల్లో ఉక్రెయిన్ అంశం ప్రస్తావనకు వచ్చిందనీ.. అక్కడి పరిస్థితులపై ఇరువురు నేతలూ ఆందోళన వ్యక్తంచేసినట్టు చెప్పారు. ఉక్రెయిన్లో హింసాకాండను తక్షణమే నిలిపివేయాలనీ.. ఇరు దేశాధినేతలు నేరుగా చర్చలు జరిపి శాంతిస్థాపనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ‘‘ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ యుద్ధం త్వరగా పరిష్కారం కావాలని కోరుకున్నారు. అలాగే, ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఉద్యోగావకాశాలతో పాటు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్షం, ఇతర సాంకేతికపరమైన అంశాలపై చర్చించారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ఇద్దరు ప్రధానులూ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై కొనసాగుతున్న సంప్రదింపులపైనా చర్చలు జరిపారు. ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వాణిజ్యం, రక్షణ రంగంలో పరస్పర సహకారానికి ఇరుదేశాలూ అంగీకారం తెలిపాయి’’ అని ష్రింగ్లా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ