Omicron: భారత్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరుగుతాయ్, కానీ..
భారత్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశముందని, పాజిటివిటీ రేటు కూడా అధికంగా ఉంటుందని అన్నారు దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ ఏంజెలినా కాట్జీ.
ఇంటర్నెట్డెస్క్: భారత్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశముందని, పాజిటివిటీ రేటు కూడా అధికంగా ఉంటుందని అన్నారు దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ ఏంజెలినా కాట్జీ. అయితే వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉండే అవకాశముందని అన్నారు. భారత్లో ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్ తీవ్రతను కచ్చితంగా అడ్డుకుంటాయని అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలిసారిగా బయటపడింది దక్షిణాఫ్రికాలోనే. ఈ వేరియంట్ను గుర్తించిన నిపుణుల్లో కాట్జీ కూడా ఒకరు. తాజాగా ఆమె పీటీఐ వార్తా సంస్థకు ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘కొవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదు. ఒమిక్రాన్తో ఈ మహమ్మారి అంతమవుతుందని కొందరు చెబుతున్నారు. కానీ అలా నమ్మడం కష్టం. అయితే రానున్న రోజుల్లో ఇది ఎండమిక్ స్థాయికి తగ్గొచ్చు. ఇక భారత్ విషయానికొస్తే.. ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశముంది. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగా ఉండొచ్చు. అయితే సానుకూలాంశం ఏంటంటే.. దక్షిణాఫ్రికాలాగే భారత్లోనూ ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ తీవ్రతను తగ్గించడంలో సాయపడతాయి. టీకాలు వేసుకున్నవారికి, గతంతో కొవిడ్ బారిన పడినవారికి ఒమిక్రాన్ ముప్పు తక్కువే. కానీ టీకాలు తీసుకోని వారికి మాత్రం 100శాతం ముప్పు పొంచి ఉంది’’ అని ఆమె అన్నారు.
ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని వల్ల ఆసుపత్రిలో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయని కాట్జీ తెలిపారు. ఈ వేరియంట్ ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా బయటపడుతోందని తెలిపారు. అంతేగాక, చిన్నారులకు కూడా సోకే ప్రమాదం ఉందని, అయితే వారు ఐదు-ఆరు రోజుల్లోనే కోలుకుంటున్నారని చెప్పారు. అయితే ఒమిక్రాన్ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్లతో పాటు మనం పాటించే కరోనా నివారణ మార్గదర్శకాలు చాలా ముఖ్యమని కాట్జే అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని, మాస్క్లు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు