India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్(Corona Virus) మరోసారి కలవరానికి గురిచేస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ (Corona virus) మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అమాంతం 40 శాతం పెరిగి.. 3,016కి చేరాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ (Union health ministry) వెల్లడించింది. నిన్న 1,10,522 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఈస్థాయి పెరుగుదల కనిపించింది. ముందురోజు ఈ కేసుల సంఖ్య 2,151గా ఉంది.
కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు (active cases) 13,509(0.03శాతం)కి చేరాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతానికి చేరడం కలవరానికి గురిచేస్తోంది. కేంద్రం కొత్తగా 14 మరణాలను ప్రకటించింది. అందులో కేరళ నుంచి ఎనిమిది మరణాలు వచ్చాయి. అవి సవరించిన గణాంకాలు. ఇక 2021 నుంచి 220.65 కోట్ల టీకా డోసులు పంపిణీ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
అత్యవసరంగా సమావేశం కానున్న దిల్లీ ప్రభుత్వం..
బుధవారం దిల్లీలో 300 కరోనా (Corona virus)కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది ఆగస్టు 31 తర్వాత.. ఇంత మొత్తంలో కేసులు నమోదయ్యాయి. దాంతో దిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులతో ఇవాళ దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం