India Corona: ఒక్కరోజే 10 వేల కరోనా కొత్త కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా(Coronavirus) కేసులు మరోసారి పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 230 రోజుల అత్యధికానికి చేరాయి. కొత్తగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,158 మందికి వైరస్ సోకినట్లు తేలిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించింది. ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 44,998(0.10శాతం)కి చేరాయి. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.
ఇదిలా ఉంటే.. మన దేశంలో కొవిడ్(Covid 19) ఎండమిక్ దశకు చేరుకుందని బుధవారం అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ క్రమంలో మరో 10-12 రోజులపాటు కేసుల ఉద్ధృతి కొనసాగుతుందని.. ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్, దాని ఉపరకమైన ఎక్స్బీబీ.1.16(XBB.1.16 subvariant) కారణంగా కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ.. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.