భారత్‌కు చేరిన క్రయోజనిక్‌ కంటైనర్లు

సింగపూర్‌ నుంచి 4 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు భారత్‌కు చేరాయి. ఇవాళ ఉదయం సింగపూర్‌ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్‌ సి-17 విమానం పశ్చిమ్‌బెంగాల్‌లోని పనగఢ్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది....

Published : 24 Apr 2021 23:24 IST

పనగఢ్‌:  సింగపూర్‌ నుంచి 4 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు భారత్‌కు చేరాయి. ఇవాళ ఉదయం సింగపూర్‌ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్‌ సి-17 విమానం పశ్చిమబెంగాల్‌లోని పనగఢ్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. కరోనా విజృంభణతో దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దేశీయ ప్లాంట్లు ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచినప్పటికీ అవసరాలకు సరిపడా ప్రాణవాయువు లభించడం లేదు. దేశంలో పరిస్థితి క్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సింగపూర్‌తో ఆక్సిజన్‌ దిగుమతి కోసం సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించిన తర్వాత భారత్‌ నుంచి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఖాళీ యుద్ధ విమానాలు ఆ దేశానికి వెళ్లాయి. తిరిగి ఆక్సిజన్‌ కంటైనర్లను లోడ్‌ చేసుకొని చాంగి విమానాశ్రయం నుంచి స్వదేశానికి వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని