Ladakh: లద్దాఖ్‌ సిగలో ‘వజ్రా’యుధం.. సరిహద్దుల్లోకి కే9-వజ్ర హోవిట్జర్‌

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ తూర్పు లద్దాఖ్‌లో అధునాతన ఆయుధాలను మోహరిస్తోంది భారత సైన్యం. ఇందులో భాగంగానే లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌ ఏరియాల్లో తొలిసారిగా కే9

Updated : 03 Oct 2021 11:33 IST

లద్దాఖ్‌: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ తూర్పు లద్దాఖ్‌లో అధునాతన ఆయుధాలను మోహరిస్తోంది భారత సైన్యం. ఇందులో భాగంగానే లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌ ఏరియాల్లో తొలిసారిగా కే9 - వజ్ర శతఘ్నులను మోహరించింది. స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9 - వజ్ర శతఘ్నులు.. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై విరుచుకుపడి ధ్వంసం చేయగలవు. ఈ హోవిట్జర్‌లతో కూడిన మొత్తం రెజిమెంట్‌ను వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్‌ సెక్టార్‌లో మోహరించారు. 

‘‘ఈ శతఘ్నులు అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోనూ పనిచేయగలవని సన్నాహాక పరీక్షల్లో రుజువైంది. ప్రస్తుతం కే9 వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. లద్దాఖ్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి’’ అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె తెలిపారు. 

కే9 వజ్ర హోవిట్జర్‌ను 2018లో సైన్యంలో ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంస్థ ఎల్‌ అండ్‌ టీ వీటిని గుజరాత్‌లో తయారు చేసింది. ఈ శతఘ్ని 50 టన్నులు బరువు ఉంటుంది. 47 కేజీల బాంబులను పేల్చగలదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని