Delhi: చైనాతో చర్చలు.. అంతలోనే గల్వాన్లో భారత్ సైనికుల క్రికెట్!
లద్దాఖ్ (Ladakh)లోని గల్వాన్ (Galwan) ప్రాంతంలో భారత్ సైనికులు (Indian Army) క్రికెట్ ఆడుతున్న ఫొటోలను ఇండియన్ ఆర్మీ ట్విటర్లో పోస్టు చేసింది. భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. చైనా విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపిన తర్వాతి రోజునే ఇలా ట్వీట్ చేయడం గమనార్హం.
దిల్లీ: భారత్-చైనాల (India-China) మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన తూర్పు లద్దాఖ్ (Ladakh)లోని గల్వాన్ (Galwan) ప్రాంతంలో భారత్ సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత్ సైన్యం (Indian Army) అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. గల్వాన్లో కచ్చితంగా ఎక్కడ ఆడుతున్నారనే విషయం చెప్పకపోయినప్పటికీ.. పెట్రోలింగ్ పాయింట్ 14కి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆడుతున్న ప్రాంతం ఉండొచ్చని జాతీయ మీడియావర్గాల కథనాలు వెల్లడించాయి. 2020 మే నెలలో ఇరుదేశాల సైనికుల మధ్య గల్వాన్ ప్రాంతంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. 20 మంది భారత్ సైనికులు వీరమరణం పొందగా.. చైనా మాత్రం మృతులు, క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. దిల్లీలో నిర్వహిస్తున్న జీ20 సదస్సులో భాగంగా భారత్ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగశాఖ మంత్రి చిన్ గ్వాంగ్ ముఖాముఖి సమావేశమైన తర్వాతి రోజునే ఇండియన్ ఆర్మీ ఫొటోలను పోస్టు చేయడం గమనార్హం.
‘‘పటియాలా బ్రిగేడ్ త్రిశూల్ డివిజన్ చాలా ఉత్సాహంగా క్రికెట్ పోటీలను నిర్వహించింది. అది కూడా ఎత్తైన, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో.. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం’’ అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్డ్ 14 సైనిక బృందం ట్విటర్లో రాసుకొచ్చింది. గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి.. పెట్రోలింగ్ పాయింట్ 14కు 1.5 కిలోమీటర్ల దూరం నుంచి బఫర్ జోన్గా ప్రకటించారు. తాజాగా బఫర్జోన్ను సమీపంలోనే భారతసైన్యం క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది.
భారత్-చైనాల మధ్య సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాల కమాండర్ స్థాయి అధికారులు ఇప్పటి వరకు 17 విడతలుగా చర్చలు జరిపినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఉద్రిక్తతలు కాస్త చల్లారడం మినహా.. శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఓ వైపు బఫర్ జోన్ నుంచి వెనక్కి వెళుతున్నామని చెబుతున్న చైనా... అవకాశం చూసి భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తోంది. చైనా చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గురువారం దిల్లీలో చైనా విదేశాంగ శాఖ మంత్రి చిన్ గ్వాంగ్తో సమావేశమైన కేంద్ర మంత్రి జైశంకర్.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సవ్యంగా లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు