Ukraine Crisis: ‘అవి నా పిల్లలు’..పెంపుడు జాగ్వార్, పాంథర్ను వదిలేసి రాలేనన్న ఏపీ వాసి
ఓ ఆంధ్రప్రదేశ్ వాసి తన పెంపుడు జంతువులను వదిలేసి ఉక్రెయిన్ నుంచి రాలేనంటున్నాడు.......
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో భారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ వాసి మాత్రం తన పెంపుడు జంతువులను వదిలేసి రాలేనంటున్నాడు. ఇంతకీ అతడు పెంచుకుంటున్న జంతువులు ఏంటి అనుకుంటున్నారా..? జాగ్వార్, బ్లాక్ పాంథర్. వీటితోపాటు మరో నాలుగు కుక్కలు కూడా. వాటిని తన పిల్లలుగా పేర్కొంటూ.. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వాటి జీవితాలను అగాథంలో పడేయలేనని తేల్చి చెబుతున్నాడు. ప్రస్తుతం ఓ బంకర్లో భయంభయంగా గడుపుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరికుమార్ పాటిల్ మెడిసిన్ చదివేందుకు 2007లో ఉక్రెయిన్లోని సెవెరోడొనెట్క్స్ నగరానికి వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్గా పనిచేస్తున్నాడు. అయితే జంతువులంటే అమితంగా ఇష్టపడే గిరికుమార్.. 20 నెలల క్రితం ఓ జూలో గాయపడిన జాగ్వార్ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నాడు. దానికి ‘యాశా’ అని పేరు పెట్టి ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. యాశాకి తోడు కోసం ఆరు నెలల క్రితం ఓ బ్లాక్ పాంథర్ను ఇంటికి తీసుకొచ్చి పెంచుతున్నాడు. మరో నాలుగు కుక్కలను కూడా సాకుతున్నాడు.
ఉక్రెయిన్లో యుద్ధం మొదలవడంతో తన ఇంటి కింద ఉన్న బేస్మెంట్లోనే ప్రస్తుతం కాలం గడుపుతున్నాడు. జంతువులకు ఆహారం తీసుకొచ్చేందుకు మాత్రమే నుంచి బయటకు వస్తున్నాడు. అయితే తిరిగి ఇంటికి రావాలని ఏపీలోని కుటుంబీకులు వేడుకుంటున్నా.. పెంపుడు జంతువులను వదిలేసి రాలేకపోతున్నాడు. ‘నా కుటుంబం నన్ను తిరిగి రావాలని కోరుతోంది. కానీ నా ప్రాణాలు కాపాడుకోవడానికి నా పెంపుడు జంతువులను అపాయంలో పడేయలేను. అవి నా పిల్లలు. నా చివరి శ్వాస వరకు నేను వాటితోనే ఉంటా. వాటిని రక్షిస్తా’ అని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే వార్తా సంస్థకు గిరికుమార్ తెలిపాడు.
‘చుట్టుపక్కల బాంబుల మోత మోగుతోంది. నా జంతువులు భయపడుతున్నాయి. సరిగా తినడంలేదు. వాటిని నేను వదిలేయలేను’ అని పేర్కొన్నాడు. గిరికుమార్కు ‘JAGUAR KUMAR TELUGU’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉంది. 84వేల సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. తన పెంపుడు జంతువుల గురించి తరచూ అందులో వీడియోలు పెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే..‘ఆపరేషన్ గంగ’ పేరుతో భారత ప్రభుత్వం ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొందరు తాము పెంచుకుంటున్న పెట్స్ను కూడా వెంట తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన పెంపుడు జంతువులను కూడా భారత్కు తరలించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని గిరికుమార్ ఆశిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.