Covaxin: కొవాగ్జిన్తో డెల్టా ఆట కట్టు
కరోనా రకాల్లో అత్యంత ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్ ఆట కట్టించడంలో భారత్కు చెందిన కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్ఐహెచ్) తెలిపింది
అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడి
వాషింగ్టన్: కరోనా రకాల్లో అత్యంత ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్ ఆట కట్టించడంలో భారత్కు చెందిన కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్ఐహెచ్) తెలిపింది. ఈ టీకా తీసుకున్న వారి సీరమ్లపై రెండు అధ్యయనాలు జరపగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కొవాగ్జిన్ సమర్థంగా తటస్థీకరిస్తున్నట్లు తేలిందని ఎన్ఐహెచ్ పేర్కొంది.
‘‘భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సహకారంతో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తోంది. ఈ టీకా తీసుకున్న వారి బ్లడ్ సీరమ్లను అధ్యయనం చేయగా.. కొవాగ్జిన్ ఉత్పత్తి చేసే యాంటీబాడీలు బి.1.1.7(ఆల్ఫా), బి.1.617(డెల్టా) రకాలను సమర్థంగా తటస్థీకరిస్తున్నట్లు తెలిసింది’’అని ఎన్ఐహెచ్ వెల్లడించింది. ఆల్ఫా వేరియంట్ మొట్టమొదట యూకేలో బయటపడగా.. డెల్టా రకాన్ని తొలిసారిగా భారత్లో గుర్తించారు.
ఇప్పటివరకు వెల్లడించిన కొవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఈ టీకా భద్రమైందని, అన్ని రకాల వైరస్లపై పనిచేస్తుందని తేలినట్లు ఎన్ఐహెచ్ గుర్తుచేసింది. మూడో దశ ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించని ఫేజ్ 3 ఫలితాల ప్రకారం.. ఈ టీకా కరోనాపై 78శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. మరోవైపు చిన్నారులకు కూడా కొవాగ్జిన్ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పిల్లలపై ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.