DGCA: విమానంలోకి దివ్యాంగ బాలుడి ప్రవేశానికి నిరాకరణ ఘటన.. సంస్థకు డీజీసీఏ జరిమానా
ఇటీవల ప్రత్యేకవసరాలు కలిగిన ఓ చిన్నారిని విమానంలోకి రానివ్వని ఘటనలో సంబంధిత విమానయాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. తొలుత...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ప్రత్యేకవసరాలు కలిగిన ఓ చిన్నారిని విమానంలోకి రానివ్వని ఘటనలో ఇండిగో విమానయాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝుళిపించింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. తొలుత ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ.. సంబంధిత ప్రయాణికులతో సిబ్బంది అనుచితంగా వ్యవహరించినట్లు తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు మే 27వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.
‘బాలుడి విషయంలో సిబ్బంది మరింత దయాగుణంతో వ్యవహరిస్తే పరిస్థితి చక్కబడేది. తద్వారా బోర్డింగ్ నిరాకరణ పరిస్థితి వచ్చేది కాదు. ప్రత్యేక సందర్భాల్లో సిబ్బంది మరింత గొప్పగా స్పందించాలి. కానీ, ఈ విషయంలో వారు విఫలమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించారు. కాబట్టి, రూ.5 లక్షల జరిమానా విధిస్తున్న’ట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించేందుకుగానూ.. నిబంధనలను పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఏం జరిగిందంటే..!
మే 7న హైదరాబాద్ వెళ్లేందుకు దివ్యాంగ బాలుడితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే, అతను విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఈ వ్యవహారం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. స్వయంగా దర్యాప్తు చేపడతానని ప్రకటించారు. మరోవైపు డీజీసీఏ కమిటీ కూడా దర్యాప్తు చేపట్టింది. తాజాగా జరిమానా విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.