ఇండో-యూఎస్‌ ఆర్మీ ‘యుద్ధ అభ్యాస్‌’ ప్రారంభం

భారత్‌, అమెరికా ఆర్మీ దళాలు సంయుక్తంగా నిర్వహించే ‘యుద్ధ అభ్యాస్‌’ 16వ విడత శిక్షణ కార్యక్రమాలు సోమవారం రాజస్థాన్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. భారత ఆర్మీ 170వ ఇన్‌ఫాంట్రీ దళ కమాండర్‌ ముకేశ్‌ భన్వాలా నేతృత్వంలో పశ్చిమ సెక్టార్‌లోని మహాజన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ వ్యాయామ ప్రక్రియ మొదలైంది.

Published : 08 Feb 2021 21:18 IST

జైపూర్: భారత్‌, అమెరికా ఆర్మీ దళాలు సంయుక్తంగా నిర్వహించే ‘యుద్ధ అభ్యాస్‌’ 16వ విడత శిక్షణ కార్యక్రమాలు సోమవారం రాజస్థాన్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. భారత ఆర్మీ 170వ ఇన్‌ఫాంట్రీ దళ కమాండర్‌ ముకేశ్‌ భన్వాలా నేతృత్వంలో పశ్చిమ సెక్టార్‌లోని మహాజన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ వ్యాయామ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా యూఎస్‌ దళానికి ముకేశ్‌ భన్వాలా స్వాగతం పలికినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ అమితాబ్‌ శర్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. దళాల మధ్య ఆలోచనలు పంచుకోవడం సహా ఒకరికొకరు కార్యాచరణ అనుభవాల నుంచి నేర్చుకోవలసిన అవసరాన్ని భన్వాలా ప్రత్యేకంగా వెల్లడించారు. 

ఈ ప్రక్రియలో భాగంగా యూఎస్‌ ఆర్మీకి చెందిన అధునాతన లైట్‌ హెలికాప్టర్‌ డబ్ల్యూఎస్‌ఐ రుద్ర, ఎంఐ 17, చినూక్స్‌, స్ట్రైకర్‌ వాహనాలతో పాటు.. భారత్‌ ఆర్మీకి చెందిన ఇన్‌ఫాంట్రీ కంబాట్‌ వాహనాలు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 21 వరకు ఈ విన్యాసాలు కొనసాగనున్నాయని తెలిపారు. కాగా ఇటీవల భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన వైమానిక దళాలు సంయుక్తంగా ఐదు రోజుల పాటు డ్రిల్‌ నిర్వహించిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. 

ఇదీ చదవండి

ఒక్క ఫోన్‌ కాల్‌ 12 ప్రాణాలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని