crime news: అత్యాచారం కేసులో మంత్రి కుమారుడి పేరు.. బాధితురాలిపై ఇంక్తో దాడి..!
రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన ఓ యువతిపై దిల్లీలోని నడిరోడ్డుపై నీలి రంగు సిరాతో దాడి చేశారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన ఓ యువతిపై దిల్లీలోని నడిరోడ్డుపై నీలి రంగు సిరాతో దాడి చేశారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకొంది. శనివారం దిల్లీలోని కలిండీ కంజ్ రోడ్డుపై బాధితురాలు తన తల్లితో కలిసి వాకింగ్ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి నీలిరంగు ద్రవాన్ని ఆమెపై చల్లారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి పరీక్షలు నిర్వహించారు.
బాధితురాలు గత నెలలో రాజస్థాన్ మంత్రి మహేష్ జోషీ కుమారుడు రోహిత్ జోషిపై అత్యాచారం ఆరోపణలు చేస్తూ దిల్లీలో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకొంటానని ప్రమాణం చేసి.. జనవరి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్యలో పలుమార్లు అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. నిందితుడు రోహిత్ తనకు ఫేస్బుక్లో గతేడాది పరిచయం అయ్యాడని వెల్లడించింది. అత్యాచారంతోపాటు కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు కూడా చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసు బృందం నిందితుడిని అరెస్టు చేసేందుకు జైపూర్ కూడా వెళ్లింది. కానీ, ఆ సమయంలో రాజేష్ ఇంట్లో లేడు. ఆ తర్వాత దిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకొని నిన్న పోలీసు విచారణ బృందం ఎదుట హాజరయ్యాడు. ఈ ఆరోపణలు ఆధారంగా మంత్రి మహేష్ జోషిపై చర్యలు తీసుకొనే అంశాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కొట్టిపారేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా