Shraddha Walkar: ఆత్మగా తిరిగి వచ్చి అతడిని 70 ముక్కలు చేయాలి..

దిల్లీలో వెలుగులోకి వచ్చిన దారుణ హత్య ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. దీనిపై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 16 Nov 2022 18:42 IST

దిల్లీ: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్యచేసి, 35 ముక్కలు చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడిని విచారిస్తోన్న పోలీసులు ఎన్నో విస్తుపోయే విషయాలను గుర్తిస్తున్నారు. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. దేవుడికి వింత అభ్యర్థన చేశారు. 

‘మరణించి ఎక్కడో విశ్రాంతి తీసుకునే బదులు.. ఆత్మగా తిరిగి వచ్చి అతడిని 70 ముక్కలు చేయాలి. కేవలం చట్టం భయంతో ఇలాంటి హత్యలను నిరోధించలేం. మృతిచెందినవారి  ఆత్మలు తిరిగివచ్చి హంతకులను చంపితే.. వాటిని కచ్చితంగా ఆపవచ్చు. భగవంతుడు దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్‌, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో అఫ్తాబ్‌ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. ఆపై శవాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్‌లో దాచాడు. 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే.. అఫ్తాబ్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో మరో యువతికి వలవేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్‌మెంట్‌కు రప్పించుకున్నాడని వెల్లడైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని